News March 20, 2025

మన్యంకొండ హుండీ ఆదాయం రూ.35.26 లక్షలు

image

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత బుధవారం 2వసారి హుండీ లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన సొమ్ము మొత్తం రూ.35,26,085 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ, ఈవో శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్ మదనేశ్వర్, సూపరింటెండెంట్ నిత్యానంద చారి, IDBC మేనేజర్ నీలకంఠ పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

సాయిబాబాను ఎలా పూజించాలి?

image

సాయిబాబా పూజలో కఠిన నియమాలేం ఉండవు. ఉపవాసం చేసేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇతరులను దూషించకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆయన పూజలో భక్తే ప్రధానం. భక్తి లేని ఘనమైన పూజ కంటే, భక్తితో సమర్పించే ఓ పువ్వు కూడా బాబాకు సంతోషాన్నిస్తుంది. బాబాకు మన మనసనే పుష్పాన్ని సమర్పించినా చాలు. ఆయన పేరు తలచి, దానధర్మాలు చేస్తే సాయినాధుని అనుగ్రహం భక్తులపై తప్పక ఉంటుందట. <<-se>>#Pooja<<>>

News November 13, 2025

ఆలు కుదురూ చేను కుదురూ ఆనందం

image

“ఆలు”అంటే భార్య. “కుదురు” అంటే స్థిరత్వం లేదా సవ్యంగా ఉండటం. భార్యతో కలహాలు లేకుండా కుటుంబ జీవితం సజావుగా, సంతోషంగా, స్థిరంగా ఉన్నప్పుడూ.. చేను కుదురూ అంటే పొలం(ఆదాయ వనరులు) బాగుండి, ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడే రైతు జీవితంలో నిజమైన ఆనందం, ప్రశాంతత లభిస్తాయని ఈ సామెత చెబుతుంది.

News November 13, 2025

రేపటి కోసం..

image

జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం రేపటి కోసం ఎదురు చూస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు ఉదయం మొదలుకానుంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినా ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనేది EVMలు తేల్చనున్నాయి. అటు బిహార్‌లోనూ రేపు ఓట్ల లెక్కింపు జరగనుండగా ఫలితాలపై ఆ రాష్ట్రంతో పాటు దేశ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.