News March 20, 2025
రాజ్భవన్ రోడ్డులోని ATMలో పాడు పని!

ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్భవన్ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులకు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 17, 2026
నితీశ్ రెడ్డి ఆల్రౌండర్ కాదు: కైఫ్

NZతో ODI సిరీస్లో IND పిచ్కి తగ్గట్టు ప్లేయింగ్-11ని ఎంపిక చేయట్లేదని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. జట్టులో నితీశ్ రోల్ ఏంటో అర్థం కావడం లేదని తన YouTube వీడియోలో చెప్పుకొచ్చారు. ‘నితీశ్ ఆల్రౌండర్ కాదు. అతను బ్యాటర్ మాత్రమే. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి. అతడిని బ్యాటర్గా డెవలప్ చేయాలి. పార్ట్ టైమ్ బౌలర్ను ఆల్రౌండర్ అనడం కరెక్ట్ కాదు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
News January 17, 2026
కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.
News January 17, 2026
అన్నమయ్య: టమాటా ధరలు ఢమాల్

మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.230 కి పడిపోయింది. శనివారం మార్కెట్ కు 72 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. 10 కిలోల మేలు రకం టమాటాలు – రూ 230, రెండవ రకం రూ – 220, మూడో రకం రూ.190తో కొనుగోలు చేసినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ వెల్లడించారు. టమాటా దిగుబడి తక్కువగా వస్తున్నప్పటికీ రేట్లు పెరగక పోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.


