News March 20, 2025

రాష్ట్రంలో పెరిగిన బాలికల జననాలు

image

AP: రాష్ట్రంలో బాలికల జననాలు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2023-24లో ప్రతి వెయ్యి మంది బాలురకు 944 మంది బాలికల జననాలు నమోదయ్యాయి. 2014-15లో ఇది 1000:921గా ఉండేది. మరోవైపు జాతీయస్థాయిలో 2023-24లో ఇదే నిష్పత్తి 1000:930గా ఉంది. గోవా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో 2023-24లో బాలికల జననాలు అధికంగా ఉండగా.. లక్షద్వీప్, అండమాన్ నికోబార్, బిహార్‌లో తక్కువగా నమోదయ్యాయి.

Similar News

News March 21, 2025

నంది అవార్డులను పునరుద్ధరించాలి: నిర్మాతల మండలి

image

APలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని నిర్మాతల మండలి తెలిపింది. విశాఖ, రాజమండ్రి, తిరుపతిలో స్టూడియోలు నిర్మించాలని, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరామంది. నంది అవార్డులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. సినీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రులు లోకేశ్, దుర్గేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

News March 21, 2025

ఎన్నాళ్లకెన్నాళ్లకో ఈ మురిపెం!

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. ఈ వారం వరుసగా 5 సెషన్లలోనూ అదరగొట్టాయి. కొన్ని నెలల తర్వాత బెంచ్‌మార్క్ సూచీలు ఒక వారమంతా లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఏడాది నవంబర్ నాటి పుల్‌బ్యాక్ ర్యాలీలో చివరిసారిగా ఈ ఫీట్ నమోదైంది. NOV 29 నుంచి DEC 5 వరకు సూచీలు వరుసగా ఎగిశాయి. నిఫ్టీ ప్రస్తుత 23,300 స్థాయిలో కన్సాలిడేట్ అయితే మార్కెట్ వర్గాల్లో పాజిటివ్ సెంటిమెంటు మరింత బలపడుతుంది.

News March 21, 2025

‘యానిమల్’ లుక్‌లో ధోనీ.. భారీ రెమ్యునరేషన్!

image

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కిన ఈ-సైకిల్ <<15801433>>యాడ్<<>> భారీ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ యాడ్ కోసం వీరిద్దరూ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ యాడ్ షూట్‌కు ధోనీ రూ.8 కోట్లు తీసుకున్నారని, సందీప్ రూ.5 కోట్లు పొందినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ యాడ్‌పై ఆ సైకిల్ కంపెనీ సీఈవో కునాల్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

error: Content is protected !!