News March 20, 2025

యువకుడి ప్రాణం తీసిన బెట్టింగ్

image

బెట్టింగ్ ఊబిలో పడి అప్పు మీద అప్పు చేసి, తీర్చేందుకు స్తోమత లేక.. చివరికి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొలిమిగుండ్ల మండలం గోర్విమానుపల్లెకు చెందిన మహేంద్ర(28) గుత్తి రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మహేంద్ర గతంలో వాలంటీర్‌గా పనిచేసి, ప్రస్తుతం పెన్నా సిమెంట్‌లో పనిచేస్తున్నాడు.

Similar News

News March 21, 2025

HYD: ‘విద్యార్థి’ ప్రయాణం ప్రమాదం!

image

సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం స్టూడెంట్స్‌ సాహసాలు చేస్తూ కాలేజీలకు వెళుతున్నారు. ప్రమాదపు అంచులో ప్రయాణం ఆందోళన కలిగిస్తోందని నగరవాసులు Way2Newsకు తెలిపారు. అమ్మాయిలూ ఫుట్‌ బోర్డింగ్ చేస్తున్నారు. ఇక అబ్బాయిల పరిస్థితిని పై ఫొటోలో చూడొచ్చు. BNరెడ్డినగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రూట్ (గుర్రంగూడ)లో ఈ పరిస్థితి ఉంది. ఈ రూట్‌లో బస్సు సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News March 21, 2025

బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని సింగర్ మనోను కోరిన కలెక్టర్

image

బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని జిల్లా కలెక్టర్ జె .వెంకట మురళి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రముఖ గాయకులు (మనో)నాగుర్ బాబు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. చందోలు బంగ్లాముఖి దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యంలో ఆయన కలెక్టర్ ను కలిశారు. వారివురూ 10 నిమిషాల పాటు జిల్లా గీతంపై చర్చించుకున్నారు. కలెక్టర్ కోరిక మేరకు బాపట్ల జిల్లా గీతాన్ని ఆలపించడానికి మనో అంగీకరించారు.

News March 21, 2025

పది వార్షిక పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది: KMR కలెక్టర్

image

పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యయి. మొదటి రోజు ప్రశాంతంగా పరీక్ష జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డిలోని గౌతమ్ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలోని తరగతి గదులను పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట కామారెడ్డి తహశీల్దార్ జనార్ధన్ ఉన్నారు.

error: Content is protected !!