News March 20, 2025

ఎస్సారెస్పీ స్టేజ్-2కు రూ.34.01 కోట్లు కేటాయింపు

image

సూర్యాపేట జిల్లాలోని SRSP స్టేజ్-2 కింద కొనసాగుతున్న పనులకు రూ.34.01 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. తూములు, షట్టర్లు, లైనింగ్ కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. జిల్లాలో వందకు పైగా కిలోమీటర్ల మేరకు ఉన్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు లైనింగ్ లేకపోవడంతో నీటిని విడుదల సమయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మూసీ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు రూ.50కోట్లు కేటాయించడంతో చివరి ఆయకట్టుకు సైతం నీరందనుంది.

Similar News

News March 2, 2026

SRCL: బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

image

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, వారికి పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి 31 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News March 2, 2026

ఉగాది నాటికి 16,702 ఇళ్ల పూర్తి లక్ష్యం సాధించాలి: జేసీ

image

అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఏ బిల్లుల అప్లోడ్, స్వామిత్వం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు.

News March 2, 2026

కామారెడ్డి: ప్రజాస్వామ్య విలువలకు నిలువుటద్దం దుద్దిల్ల

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, దివంగత నాయకుడు దుద్దిల్ల శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మహోన్నత నేత అని కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి కొనియాడారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి వేడుకలను నిర్వహించారు. అదనపు ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.