News March 20, 2025
మదనపల్లె: భారీగా పడిపోయిన ధరలు.. KG రూ.11

మదనపల్లెలో కిలో టమాటాలు రూ.11 పలుకుతున్నాయి. వారం రోజులుగా ధరలు నిలకడగా ఉన్నాయి. టమాటా మార్కెట్లో మొదటి క్వాలిటి టమాటా కిలో రూ.11వరకు గురువారం పలికింది. పంట దిగుబడులు ఉన్నప్పటికీ రేట్లు పెరగలేదు. మార్కెట్కు ఆదివారం 108మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు మదనపల్లెకు తీసుకువచ్చారు. A గ్రేడ్ క్వాలిటీ రకం కిలో రూ.11, B గ్రేడ్ రకం రూ.10, C గ్రేడ్ రకం రూ.9 చొప్పున అమ్ముడుపోయాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News March 21, 2025
ఉగాది రోజున ‘స్పిరిట్’ స్టార్ట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోయే ‘స్పిరిట్’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, రెగ్యులర్ షూటింగ్కు కాస్త టైమ్ పట్టే అవకాశం ఉంది.
News March 21, 2025
విశాఖలో ఇంగ్లిష్ పరీక్షకు 78 మంది గైర్హాజరు

విశాఖలో శుక్రవారం పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 28,609 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 28,531 మంది హాజరైయారు. 78 మంది పరీక్షకు హాజరు కాలేదు. అయితే బుధవారం 72 పరీక్ష కేంద్రాలను డీఈవో ప్రేమకుమార్, స్క్వాడ్ బృందాలు సందర్శించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
News March 21, 2025
వనపర్తి: ‘75 మంది ఒకేషనల్ విద్యార్థులు గైర్హాజరు’

ప్రథమ సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయని వనపర్తి ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆరు సెంటర్లలో పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. 925 మంది విద్యార్థులకు గాను 850 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 75 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.