News March 20, 2025
పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ప్రతీక్

పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి డీఈవో రేణుక దేవితో కలిసి కలెక్టర్ పరీక్షల నిర్వహణ అధికారులతో తహసీల్దారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎలాంటి మాస్ కాఫింగు అవకాశం లేకుండా చూడాలన్నారు.
Similar News
News September 16, 2025
విశాఖ: 19న జాబ్ మేళా

కంచరపాలెం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ (ఎన్సీఎస్సీ)లో ఈనెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ ఉపాధి కల్పనాధికారి శ్యాం సుందర్ తెలిపారు. బీపీవో, రిలేషిప్ మేనేజర్, టెలీకాలింగ్ ఆపరేటర్ విభాగాల్లో సుమారు 100 ఉద్యోగాలకు డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పాస్ అయిన నిరుద్యోగులు అర్హులుగా పేర్కొన్నారు. 19న ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్స్తో హాజరుకావాలని కోరారు.
News September 16, 2025
HYDలో రహదారులు గోదారులవుతోంది ఇందుకే!

HYDలో రహదారులు గోదారులు కావడానికి జనాభాకు అవసరమైన స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, చెరువులు, నాలాలు కబ్జా కావడం ప్రధాన కారణాలు. వీటన్నింటితో పాటు అందుబాటులో ఉన్న వనరుల్ని వినియోగించకపోవడంతో వరద ముంపునకు కారణమవుతున్నట్లు హైడ్రా గుర్తించింది. ఇటీవల మైత్రివనం చౌరస్తా వద్ద చేపట్టిన వరద తరలింపు చర్యలు ఫలితాలు ఇవ్వడంతో నగరంలో మరో 40 ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
News September 16, 2025
HYD: 24 గంటలు గడిచినా కనిపించనిజాడ

భారీ వర్షానికి వరద పోటెత్తడంతో ఆదివారం రాత్రి నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్, రామా జాడ ఇప్పటివరకు లభించలేదు. ఆదివారం రాత్రి నుంచి DRF, GHMC రెస్క్యూ టీమ్లు తీవ్రంగా గాలిస్తున్నాయి. మూసీ నదిలోనూ ముమ్మరంగా గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వారిద్దరు నాలాలో కొట్టుకొని పోవడంతో అఫ్జల్ సాగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.