News March 20, 2025
వంశీకి మూడు రోజుల సీఐడీ కస్టడీ

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని విచారించాలని సీఐడీ కోరగా 3వ ఏసీజేఏం కోర్టు ఆ మేరకు ఆదేశాలిచ్చింది. దీంతో ఈ నెల 22, 23, 24 తేదీల్లో విజయవాడలోని కార్యాలయంలో ఆయన్ను విచారించనున్నారు. ఈ కేసులో వంశీ ఏ71గా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళే విచారణ జరగనుంది.
Similar News
News March 21, 2025
ఉగాది రోజున ‘స్పిరిట్’ స్టార్ట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోయే ‘స్పిరిట్’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, రెగ్యులర్ షూటింగ్కు కాస్త టైమ్ పట్టే అవకాశం ఉంది.
News March 21, 2025
రాష్ట్రంలో భానుడి భగభగలు

AP: రాష్ట్రంలో ఇవాళ ఎండలు మండిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. కర్నూలు జిల్లా కోసిగిలో 40.6, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. మరోవైపు రేపు 18 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది.
News March 21, 2025
సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం లైంగిక హింస కాదు: హైకోర్టు

సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం, పాటలు పాడటం లైంగిక హింస కిందకు రాదని బాంబే హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. తన జుట్టు గురించి ఓ సహోద్యోగి కామెంట్స్ చేస్తూ పాటలు పాడారని.. మహిళల ఎదుట పురుషుల మర్మావయాల గురించి మాట్లాడారని పుణేలోని HDFC బ్యాంకు ఉద్యోగిని తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. అతడిని బ్యాంకు డిమోట్ చేయగా ఆయన పారిశ్రామిక కోర్టుకెళ్లారు. అక్కడ చుక్కెదురవ్వడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించారు.