News March 20, 2025

ఎన్టీఆర్: ‘ఏడాదికి 4,800 బస్సులు ఉత్పత్తి చేస్తాం’

image

విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో బుధవారం ప్రారంభమైన యూనిట్‌లో ఏడాదికి 4,800 బస్సులు ఉత్పత్తి చేస్తామని అశోక్ లేల్యాండ్ సంస్థ ట్వీట్ చేసింది. తమ సంస్థ చరిత్రలో మల్లవల్లి యూనిట్ ప్రారంభించడం గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఇక్కడే తమ సంస్థ ఏర్పాటు చేసిన “నలంద”లో లెర్నింగ్ సెంటర్, అడ్వాన్స్డ్ సర్వీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలిందిస్తామని అశోక్ లేల్యాండ్ Xలో పోస్ట్ చేసింది.

Similar News

News March 21, 2025

మహబూబ్‌నగర్ బస్టాండ్ రద్దీ

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ శుక్రవారం రద్దీగా కనిపించింది. గురువారంతో ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో కాలేజీ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు, బయట రూంలు తీసుకొని చదువుకునే విద్యార్థులు ఖాళీ చేసి సొంతూళ్లకు బయలుదేరారు. వారితో పాటు తల్లిదండ్రులు కూడా రావడంతో బస్టాండ్ రద్దీగా కనిపించింది.

News March 21, 2025

రాజమండ్రిలో అధికారుల మెరుపు దాడులు

image

తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం శుక్రవారం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని యువత మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఉండటంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారి ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. రాజమండ్రి గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ మెడికల్ ఏజెన్సీలో ట్రెమడల్ మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.

News March 21, 2025

మహబూబ్‌నగర్: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: ఎమ్మెల్యే 

image

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం MBNRలోని జేజేఆర్ ఫంక్షన్ హాలులో జాఫర్ ఉల్లా సిద్దిక్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.

error: Content is protected !!