News March 20, 2025

2026 మార్చి 31నాటికి ‘నక్సల్స్‌రహిత భారత్’: అమిత్ షా

image

వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా భారత్ మావోయిస్టురహిత దేశంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో 22మంది నక్సల్స్‌ని మన సైనికులు అంతం చేశారు. ఈ క్రమంలో ‘నక్సల్ రహిత భారత్‌’ దిశగా మరో విజయాన్ని సాధించారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలిచ్చినా లొంగిపోని నక్సలైట్లపై జాలి చూపే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వం వారిపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోంది’ అని పేర్కొన్నారు.

Similar News

News January 12, 2026

భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం: CGWB

image

APలో భూగర్భ జలాలు విస్తృతంగా కలుషితం అవుతున్నాయని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నివేదిక పేర్కొంది. ‘ఏపీ సహా 4 రాష్ట్రాల భూగర్భ జలాల్లో 30Ppm మించి యురేనియం సాంద్రత ఉన్నట్లు తేలింది. సత్యసాయి జిల్లాలో 16, తిరుపతిలో 3 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. పలుచోట్ల పరిమితికి మించి సోడియం కార్బొనేట్ అవశేషాలు (26.87%) ఉన్నాయి. AP సహా కొన్ని రాష్ట్రాల భూగర్భంలోకి సముద్ర జలాలు చొచ్చుకువస్తున్నాయి’ అని తెలిపింది.

News January 12, 2026

నాణ్యతలో రాజీ పడొద్దు.. విద్యార్థుల కిట్‌పై రేవంత్

image

TG: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువుల కిట్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘వేసవి సెలవుల తర్వాత బడులు ప్రారంభమయ్యే నాటికి కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దు. యూనిఫామ్, బెల్ట్, టై, షూస్, బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు ప్రొక్యూర్మెంట్ ప్లాన్లు సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.

News January 12, 2026

కోల్డ్ వేవ్స్.. వీళ్లకు ముప్పు ఎక్కువ!

image

మరికొన్నిరోజులు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని IMD హెచ్చరించింది. దీంతో గుండె, లంగ్స్, కిడ్నీ వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. నీరు తీసుకోవడం తగ్గుతుంది. ఉప్పు వాడకం పెరుగుతుంది. ఇవి BP, హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతాయి’ అని కార్డియాలజీ ప్రొఫెసర్ రాజీవ్ నారంగ్ తెలిపారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.