News March 20, 2025

2026 మార్చి 31నాటికి ‘నక్సల్స్‌రహిత భారత్’: అమిత్ షా

image

వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా భారత్ మావోయిస్టురహిత దేశంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో 22మంది నక్సల్స్‌ని మన సైనికులు అంతం చేశారు. ఈ క్రమంలో ‘నక్సల్ రహిత భారత్‌’ దిశగా మరో విజయాన్ని సాధించారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలిచ్చినా లొంగిపోని నక్సలైట్లపై జాలి చూపే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వం వారిపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోంది’ అని పేర్కొన్నారు.

Similar News

News March 28, 2025

భారత్‌లోనూ భూకంప తీవ్రత

image

మయన్మార్‌లో సంభవించిన భూకంపం భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. మేఘాలయ, కోల్‌కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై ఇది 4 తీవ్రతతో నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మరోవైపు బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడంతో థాయ్‌లాండ్ ప్రధాని షినవ్రత దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

News March 28, 2025

తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CM చంద్రబాబు

image

AP: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, వారిలోనూ తెలుగువారు ముందుండాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘తెలుగువారు దూసుకెళ్లాలనేది నా స్వార్థం. దీని కోసం అమరావతిలో క్వాంటమ్ వాలీని ప్లాన్ చేస్తున్నాం. అందులోనే అన్ని సాంకేతికతల్ని ఏర్పాటు చేస్తాం. భారత ప్రభుత్వంతో పాటు ఐఐటీ మద్రాస్, ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్‌టీతో కలిసి పనిచేస్తున్నాం. ఇలాంటిది తీసుకురావడం దేశంలోనే తొలిసారి’ అని వెల్లడించారు.

News March 28, 2025

బిల్ గేట్స్ నాతో మాట్లాడనన్నారు: CM చంద్రబాబు

image

AP: తాను కలుస్తానని మొదటిసారి కోరినప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇష్టపడలేదని CM చంద్రబాబు ‘మద్రాస్ IIT’ ప్రసంగంలో తెలిపారు. ‘రాజకీయ నాయకులతో తనకు పని లేదని ఆయన అన్నారు. ఒప్పించి 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. మనమంతా కృషి చేస్తే భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది. 2027 నాటికి మూడోస్థానం, 2047 నాటికి అగ్రదేశంగా అవతరిస్తుంది’ అని తెలిపారు.

error: Content is protected !!