News March 20, 2025
నూజివీడు: గేట్ 2025లో త్రిబుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నాలుగు త్రిబుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు గేట్ 2025 ఫలితాల్లో ప్రతిభ కనబరిచినట్లు ఆర్జీయూకేటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. గేట్లో వెయ్యిలోపు ర్యాంకులను 30 మంది విద్యార్థులు సాధించినట్లు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన అమిరెడ్డి అశోక్ జాతీయస్థాయిలో 12వ ర్యాంకు సాధించాడని వివరించారు.
Similar News
News March 11, 2026
సమాజ హితానికి పాస్టర్లు కృషి చేయాలి: విప్ ఆది శ్రీనివాస్

మతపరమైన సేవలతో పాటు సమాజంలో మంచి మార్పు తెచ్చేందుకు పాస్టర్లు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అగ్రహారంలోని శ్రీ కన్వెన్షన్లో బుధవారం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక బోధనలతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించాలని ఆయన కోరారు.
News March 11, 2026
భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ స్టవ్స్ సేల్స్.. NO STOCK

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్స్కు డిమాండ్ పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ ప్రెజర్ కుకర్స్, రైస్ కుకర్స్ను విపరీతంగా కొనేస్తున్నారు. బ్లింకిట్, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్కు 2-3 రోజులుగా ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. ఒక్క ఫ్లిప్కార్ట్లోనే 300% సేల్స్ పెరిగాయి. దీంతో వాటిలో sold out, out of stock బోర్డులు కనిపిస్తున్నాయి. దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. ఎలక్ట్రిక్ స్టవ్స్ మీరూ కొంటున్నారా?
News March 11, 2026
కల్వరాల వాసికి జీవిత ఖైదు

వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన వడ్డే కురుమయ్యకు పోక్సో (POCSO) కేసులో వనపర్తి జిల్లా జడ్జి సునీత జీవిత ఖైదు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పెబ్బేరు పోలీసులు దర్యాప్తు చేపట్టి, నేరం నిరూపితం కావడంతో శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు.


