News March 20, 2025
IPL రూల్స్పై బీసీసీఐ కీలక నిర్ణయం

IPLలో కొన్ని రూల్స్పై బీసీసీఐ BCCI కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో 2 బంతులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత రెండో బంతిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను యథావిధిగా కొనసాగించనుంది.
Similar News
News March 29, 2025
INDలో 86వేల మంది వద్ద రూ.86 కోట్ల ఆస్తి!

ప్రపంచంలో 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వ్యక్తుల జాబితాలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్లు ఉన్నాయి. అమెరికాలో 9,05,413 మంది, చైనాలో 4,71,634, జపాన్లో 1,22,119, ఇండియాలో 85,698, జర్మనీలో 69,798, కెనడాలో 64,988, యూకేలో 55,667 మంది వద్ద $10Mల సంపద ఉంది.
News March 29, 2025
రేషన్కార్డులు ఉన్నవారికి గుడ్న్యూస్

AP: రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈనెల 31తో డెడ్లైన్ ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
News March 29, 2025
NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు: సీఎం చంద్రబాబు

AP: తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఒక మహనీయుడి విజన్ నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని CM చంద్రబాబు తెలిపారు. ‘పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ TDP. NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు. పుట్టాలంటే మళ్లీ ఎన్టీఆరే పుట్టాలి. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది. మనమంతా వారసులం మాత్రమే, పెత్తందారులం కాదు. TDPని లేకుండా చేయాలని చూసినవారు కాలగర్భంలో కలిసిపోయారు’ అని అన్నారు.