News March 20, 2025

మహబూబ్‌నగర్: ‘పెండింగ్ లేకుండా ట్యాక్స్ చెల్లించాలి’ 

image

మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని ప్రజలు మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ లేకుండా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం మొత్తంగా రూ.1.92 లక్షల ట్యాక్స్ వసూలు చేసినట్టు వెల్లడించారు. స్వచ్ఛందంగా ప్రజలు తమ ఇంటి, వ్యాపార సముదాయాలకు సంబంధించిన టాక్స్‌లను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 28, 2025

మహబూబ్‌‌నగర్ TO తాండూర్ రూట్‌లో కొనసాగుతున్న పనులు

image

మహబూబ్‌నగర్ నుంచి తాండూర్ వెళ్లే రూట్‌లోని ఇబ్రహీంబాద్ వద్ద రహదారి మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. చకచకా పనులు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక నాయకులు పర్యవేక్షిస్తున్నారు.  

News March 28, 2025

నాగర్‌కర్నూల్: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

image

ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన వివరాలు.. కల్వకుర్తి మండలం వెంకటాపూర్ వాసి అనిల్ గౌడ్ అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

News March 28, 2025

MBNR: Way2News కథనానికి స్పందించిన అధికారులు

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలో కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని Way2Newsతో గురువారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కోయిల్‌కొండ ఎమ్మార్వో, ఎస్ఐ వచ్చి ఊరు బయట నిల్వ ఉంచిన ఇసుకను సీజ్ చేశారు. వారికి గ్రామస్థులు థ్యాంక్స్ తెలిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు.  

error: Content is protected !!