News March 20, 2025

పరీక్ష సమయాల్లో ట్రాఫిక్ సమస్య రానియద్దు: వరంగల్ సీపీ

image

రేపటి నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు సైతం ముందస్తు చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రధానంగా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేందుకు పోలీసులు తమ వంతు సహకారాన్ని అందజేయాలని సూచించారు

Similar News

News September 15, 2025

వేరు శనగ దిగుబడి పెరగాలంటే..

image

వేరుశనగలో నత్రజని లోపిస్తే ఆకులు పసుపు పచ్చగా, భాస్వరం లోపిస్తే ఆకులు, కాండం ఎర్రగా మారి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వేరుశనగకు ఎకరాకు 8KGల నత్రజని అవసరం. దీనిని ఎకరాకు 18KGల యూరియా రూపంలోగానీ, 100KGల DAP రూపంలో గానీ విత్తనం విత్తుకునేటప్పుడే వేసుకోవాలి. పంటకు 16KGల భాస్వరం అవసరం. దీన్ని 100KGల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో లేదా 35KGల DAP రూపంలో ఆఖరి దుక్కిలో వెయ్యాలి. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది.

News September 15, 2025

వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ

image

వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే పలు సెక్షన్లపై స్టే విధించింది. ఆస్తిని వక్ఫ్‌కు అంకితం చేయాలంటే కనీసం ఐదేళ్లు ఇస్లాంను ఆచరించాలనే నిబంధనను తాత్కాలికంగా నిలిపివేసింది. 1932 నుంచి ఇప్పటివరకు వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు లేవని CJI గవాయ్ పేర్కొన్నారు. అరుదైన సందర్భాల్లోనే చట్టాల అమలును నిలిపివేస్తామన్నారు.

News September 15, 2025

KNR: ఒకే వేదికపై కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, MP

image

MNCL రైల్వే స్టేషన్‌లో <<17713840>>వందే భారత్ రైలు<<>>కు అదనపు స్టాప్‌‌ను కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, MP వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు కీలక నేతలు వేదికపై నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఎప్పుడు ఉప్పునిప్పుల్లా ఉండే ఇరుపార్టీల నాయకులు ప్రొటోకాల్ సమయంలో మాత్రం ఇలా హుందాగా వ్యవహరించడం మంచి పరిణామమని అంటున్నారు. మీ COMMENT.