News March 20, 2025
మెదక్: పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నేడు హవేలి ఘనపూర్లోని సర్దన జిల్లా పరిషత్ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News July 7, 2025
మెదక్: పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి: టీపీటీఎఫ్

బదిలీలతోపాటు పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. మెదక్లోని ఉపాధ్యాయ భవన్లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, నగదు రహిత వైద్యం అందించాలని, పెండింగ్లో ఉన్న 4విడతల డీఏను విడుదల చేయాలన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి, మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి ఉన్నారు.
News July 7, 2025
మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈగా నారాయణ నాయక్

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)గా నారాయణ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్గా బాధ్యతలు నిర్వహించిన శంకర్ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న నారాయణ నాయక్ నియమితులయ్యారు.
News July 7, 2025
మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 61 దరఖాస్తులు

ప్రజావాణి కార్యక్రమానికి 61 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం తెలిపారు. మెదక్లో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు-29, పింఛన్లు-4, ఇందిరమ్మ ఇళ్లు-7, ఇతర సమస్యలకు సంబంధించి 21 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.