News March 24, 2024
ధర్మపురిలో కన్నుల పండువగా లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం బ్రహ్మ పుష్కరిణిలో లక్ష్మీ నరసింహ స్వామి వారి తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. స్వామివారి తెప్పోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు.
Similar News
News October 2, 2024
HSBD: బాపు షూట్లో గాంధీ జయంతి వేడుకలు
భారత జాతిపిత మాత్మ గాంధీ జయంతి వేడుకలను లాంగర్ హౌస్లోని బాబు షూట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మహాత్ముడికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సత్యం అహింస శాస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వతంత్రం సాధించి పెట్టిన మహనీయుడు అని అన్నారు.
News October 2, 2024
KNR: ఒక్కో రోజు ఒక్కో రూపంలో బతుకమ్మ
బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఒక్కోరోజు ఒక్కో రూపంలో మహిళలు పూలతో బతుకమ్మను పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగింపు.
News October 2, 2024
కరీంనగర్: నేడు ఎంగిలిపూల బతుకమ్మ
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఆట పాటలతో నిర్వహిస్తారు. మొదటి రోజైన అమావాస్య నాడు ‘ఎంగిలిపూల’ బతుకమ్మను పేరుస్తారు. సాధారణంగా మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ మొదలవుతుంది. ఆనాడు ఇంటి యజమాని పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. పిండ ప్రదానం చేయలేని వాళ్లు పెద్దల పేరిట బ్రాహ్మణుడికి సాయిత్యం (వంట సామగ) ఇస్తారు.