News March 20, 2025

ఏలూరు: తాగునీటి సమస్య తలెత్తితే చర్యలు

image

ఈ వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం వేసవిలో తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వేసవిలో తాగునీటి సరఫరాపై వారం రోజులలో కార్యచరణ తీసుకోవాలన్నారు.

Similar News

News March 28, 2025

కుత్బుల్లాపూర్: గమ్యం చూపని RTC గమ్యం యాప్..!

image

చిటికెలో ఆర్టీసీ బస్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఆర్టీసీ గమ్యం యాప్ రూపొందించింది. యాప్ అందుబాటులోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించలేక పోతోంది. కుత్బుల్లాపూర్, అల్వాల్ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు బస్ ట్రాకింగ్ కోసం యాప్ ఉపయోగించగా సరైన సమాచారం అందించడం లేదని, మెరుగుపరచాలని కోరారు. అయితే అన్ని బస్సులకు ట్రాకింగ్ సిస్టం లేదని తెలుస్తోంది.

News March 28, 2025

NZB: అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం: కలెక్టర్

image

అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ.20,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు 18 ఏళ్లు పైబడి 60 ఏళ్లలోపు ఉండాలన్నారు.

News March 28, 2025

అత్యంత శక్తిమంతుల జాబితా.. PM మోదీ టాప్

image

Indian Express నివేదిక ప్రకారం మన దేశంలోని 100 మంది అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత అమిత్ షా, జైశంకర్, మోహన్ భాగవత్ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 14, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానాల్లో నిలిచారు. ఇక క్రికెటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 48వ స్థానంలో ఉండగా, విరాట్ 72, బుమ్రా 83వ ప్లేస్‌లలో ఉన్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

error: Content is protected !!