News March 20, 2025
వనపర్తి: జిరాక్స్, మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల బంద్కు కలెక్టర్ ఆదేశాలు

రేపటి నుంచి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని జిరాక్స్, మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలు మూసి వేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు మూసి ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News March 28, 2025
ప్రభుత్వం సంచలన నిర్ణయం

TG: పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్పై పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో మెట్రోరైలు MD ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండటం గమనార్హం. ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల కొత్తగా 6వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది.
News March 28, 2025
ఆర్మీలో ఉద్యోగావకాశాలు: చిత్తూరు కలెక్టర్

ఆర్మీలో ఉద్యోగాలపై చిత్తూరు కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరులో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు మార్చి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 10 చివరి తేదని కలెక్టర్ వెల్లడించారు.
News March 28, 2025
ఆసుపత్రిలో చేరిన కింగ్ ఛార్లెస్-3

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 ఆసుపత్రిలో చేరారు. 76ఏళ్ల ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. అందుకు చికిత్స తీసుకుంటుండగా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్తో హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం కింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని లండన్లోని బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. 2022లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత బ్రిటన్ కింగ్గా అవతరించిన ఛార్లెస్కు 2024 ఫిబ్రవరిలో క్యాన్సర్ నిర్ధారణ అయింది.