News March 24, 2024
గ్రౌండ్లో హార్దిక్.. రోహిత్ అంటూ ఫ్యాన్స్ అరుపులు
టాస్ వేసే సమయంలో అభిమానుల మోతతో స్టేడియం దద్దరిల్లింది. హార్దిక్, గిల్ గ్రౌండ్లోకి వెళ్లిన సమయంలో అభిమానులు రోహిత్.. రోహిత్ అంటూ అరిచారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. రోహిత్ క్రేజ్ ఇలాగే ఉంటుందంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై యాజమాన్యంపై రోహిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.
Similar News
News October 3, 2024
పెరిగిన Gold Loans డామినేషన్
FY25 ఫస్ట్ క్వార్టర్లో NBFCలు పర్సనల్ లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లనే ఎక్కువగా సాంక్షన్ చేశాయని FIDC తెలిపింది. ఇవి YoY 26% పెరిగి రూ.79,218 కోట్లకు చేరాయంది. గత ఏడాది రూ.63,495 కోట్లతో పర్సనల్ లోన్లే టాప్లో ఉన్నాయి. అన్ సెక్యూర్డ్ లోన్లపై RBI గత నవంబర్లో వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడవి రెండో స్థానానికి చేరాయి. హౌసింగ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
News October 3, 2024
వారికి 2BHK ఇళ్లతో పాటు రూ.25వేలు
TG: హైదరాబాద్ మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు 2BHK ఇళ్లతో పాటు సామగ్రి తరలింపు, ఇతర ఖర్చుల కోసం రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.25వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి ఆయా జిల్లాల్లో గ్రీవెన్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News October 3, 2024
రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఇవాళ అంకురార్పణ
AP: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇవాళ రాత్రి 7-8 గంటల మధ్య అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాలకు భారీగా భక్తులు రానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. రేపు రాత్రి సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీ దర్శనాలు, ఆర్జిత సేవలను TTD రద్దు చేసింది.