News March 20, 2025

కాంగ్రెస్‌తోనే సాధ్యమైన ఎస్సీ వర్గీకరణ: మంత్రి

image

మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంత్రిని ఆందోలు నియోజకవర్గ దళిత కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో గురువారం కలిసి సన్మానించారు. కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాణిక్యం, నాయకులు గణపతి, సుధాకర్, నగేష్, కృష్ణ, లక్ష్మణ్, పాల్గొన్నారు.

Similar News

News March 26, 2025

ఎచ్చెర్ల: బడివానిపేట వీఆర్వో ఆకస్మిక మృతి

image

ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బడివానిపేట వీఆర్వో రాజారావు కార్యాలయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం ఉదయం కార్యాలయానికి ఆయన వచ్చారు. సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. తక్షణం సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 26, 2025

భద్రాచలం: ప్రమాదంలో.. ఇద్దరు మేస్త్రీలు, నలుగురు కూలీలు మృతి?

image

భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలగా, ఆరుగురు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భద్రాచలానికి చెందిన తాపీ మేస్త్రీలు ఉపేంద్ర, కామేష్‌లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మిగతా వారు అడ్డా కూలీలు కాగా, వారి వివరాలు తెలియాల్సి ఉంది. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

News March 26, 2025

కృష్ణా: జిల్లాలో మోటార్లు దొంగతనం చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

image

కృష్ణాజిల్లాలోని వివిధ మండలాలలో మోటార్ల వద్ద విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను కంకిపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దుండగుల నుంచి 216 మోటార్లు, 7 ట్రాన్స్‌ఫార్మర్‌లకు సంబంధించి సుమారు రూ.4.50 లక్షల విలువైన, 2400 మీటర్ల పొడవు, 300 కేజీల బరువున్న రాగి వైర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు.

error: Content is protected !!