News March 20, 2025

వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే?

image

పాలకుర్తి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.49,108 వచ్చినట్లు ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. 2024 మే 17 నుంచి 2025 మార్చి 20 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, 308 రోజుల ఆదాయాన్ని గురువారం ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 3, 2026

విజయవాడ: యువతకు మంచి అవకాశం.. 3 నెలల ఫ్రీ ట్రైనింగ్

image

SRR & CVR ప్రభుత్వ కళాశాలలోని స్కిల్ హబ్‌లో అప్లికేషన్ డెవలపర్(వెబ్ & మొబైల్) కోర్సులో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా స్కిల్ అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. 20 నుంచి 35 ఏళ్లలోపు వయస్సున్న డిప్లొమా/బీటెక్/డిగ్రీ /పీజీ/ అభ్యర్థులు ఈ శిక్షణలో చేరవచ్చని, ప్రవేశాలకై మార్చి 5లోపు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకై కళాశాలలోని స్కిల్ హబ్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.

News March 3, 2026

TGNPDCL పరిధిలో రికార్డు విద్యుత్ డిమాండ్

image

తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో మంగళవారం 6,441 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైంది. సోమవారం నమోదైన 6,273 మెగావాట్ల రికార్డును అధిగమించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే కారణమని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. డిమాండ్ పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని, వేసవిని ఎదుర్కొనేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు.

News March 3, 2026

‘HANUMAN ప్రాజెక్ట్’ లక్ష్యం ఇదే..

image

AP: మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను నివారించడమే ‘HANUMAN ప్రాజెక్ట్’ ఉద్దేశమని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. మనుషులు, వ్యవసాయానికి నష్టం కలిగిస్తున్న వన్యప్రాణులను ఎలా హ్యాండిల్ చేయాలనే ఆలోచనతోనే దీన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడం, సరిహద్దు గ్రామాల ప్రజల ఉపాధిని కాపాడడమే ఈ ప్రాజెక్టు కర్తవ్యమన్నారు. సంఘర్షణ జరిగినప్పుడు వెంటనే స్పందించి ఉపశమన చర్యలను చేపడతామన్నారు.