News March 20, 2025

MBNR: సీఎం మానస పుత్రికకు నిధులేవి..?: నరసింహ

image

నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని జల సాధన సమితి కో కన్వీనర్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన మానస పుత్రికగా చెప్పుకునే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించిన విషయం గుర్తుపెట్టుకుని జిల్లా అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.

Similar News

News November 6, 2025

నెల్లూరు జిల్లా విభజన ఇలా..!

image

మరోసారి నెల్లూరు జిల్లా విభజన జరగనుంది. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరు నెల్లూరులోకి రానుంది. విడవలూరు, కొడవలూరును కావలి నుంచి నెల్లూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. కలువాయి, రాపూరు, సైదాపురం గూడూరు డివిజన్‌లోకి, వరికుంటపాడు, కొండాపురం జలదంకి, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, ఉదయగిరిని కావలి డివిజన్‌లోకి మార్చేలా ప్రతిపాదనలు చేశారు.

News November 6, 2025

VKB: సీఎం వెళ్లే రహదారే ఇలా ఉంటే.. ఎలా?

image

మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. కాగా, VKB జిల్లాలోని రహదారులు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలు రాజకీయ నాయకులపై తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌కు తరుచూ HYD – బీజాపూర్ రహదారిలో వెళ్తారని సీఎం వెళ్లే రహదారికే ఈ దుస్థితి ఉంటే.. స్థానిక ప్రజలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.

News November 6, 2025

చర్ల: ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

image

తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లా పరిధిలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. తాళ్లగూడెం ఠాణా పరిధిలోని అన్నారం, మరిమల్ల గ్రామాల సమీప అడవుల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు ముగిసిన అనంతరం ఘటనా స్థలానికి వెళ్లిన భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాలను సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.