News March 20, 2025
రేపటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి

TG: రాష్ట్రంలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా 2,650 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు తీసుకెళ్లకూడదు.
* ALL THE BEST
Similar News
News March 28, 2025
పూరీ జగన్నాథ్ సినిమాకు నో చెప్పాను: రకుల్

తన కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్ని వదులుకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘కాలేజీలో చదువుకుంటున్న సమయంలో మోడలింగ్ చేశా. కన్నడ పరిశ్రమలో తొలి ఆఫర్ వచ్చింది. అది రిలీజయ్యాక పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. 70 రోజులు డేట్స్ కావాలన్నారు. అప్పటికి చదువుకుంటుండటంతో 4 రోజులు మాత్రమే ఇవ్వగలనన్నాను. అదే తరహాలో చాలా సినిమాల్ని వదులుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.
News March 28, 2025
బ్రిటన్ను వదిలేస్తున్న భారత సంతతి కుబేరుడు!

ఇతర వ్యాపారుల్లాగే ఆర్సెలార్ స్టీల్ కంపెనీ అధినేత లక్ష్మీమిత్తల్ UKను వదిలేస్తారని సమాచారం. 30 ఏళ్లుగా విదేశీ ఆదాయం, లాభాలపై ఇస్తున్న పన్ను మినహాయింపులను ప్రస్తుత లెఫ్టిస్టు ప్రభుత్వం ఎత్తేయడమే ఇందుకు కారణం. ‘మిత్తల్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఏడాదిలోపు తుది నిర్ణయం తీసుకోవచ్చు’ అని FT పేర్కొంది. పన్నుల వల్ల బ్రిటన్ సంపన్నులు ఎక్కువగా UAE, స్విట్జర్లాండ్, ఇటలీకి వలస వెళ్తున్నారు.
News March 28, 2025
సోషల్ మీడియా బజ్: RCBని డామినేట్ చేసిన CSK

ఇవాళ రాత్రి జరిగే RCBvsCSK హైఓల్టేజ్ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో రెండు జట్ల అభిమానులు పోస్టులతో హోరెత్తిస్తున్నారు. గత 24 గంటల్లో చెన్నైకి అనుకూలంగా 52%, బెంగళూరుకు 48% మంది మద్దతుగా నిలిచారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను స్టార్ స్పోర్ట్స్ SMలో విడుదల చేసింది. ఏది ఏమైనా చివరికి మ్యాచ్లో తమదే విజయమని ఇరు టీమ్స్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
ఇవాళ ఎవరు గెలుస్తారు? మీ కామెంట్.