News March 20, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔GET READY.. రేపే టెన్త్ పరీక్షలు
✔టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:MEOలు
✔తాగునీటి తలెత్తకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్
✔ముగిసిన ఇంటర్ పరీక్షలు
✔VKB: పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ
✔42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం: స్పీకర్
✔పలుచోట్ల ఇఫ్తార్ విందు
✔హన్మపూర్ హత్య కేసులో ఇద్దరికి రిమాండ్
✔యువవికాసం కోసం దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్
Similar News
News March 28, 2025
NZB: అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయి: కవిత

అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పులు మొత్తం రూ. 4 లక్షల 42 వేలు అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశామని దుష్ర్పచారం చేస్తున్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు.
News March 28, 2025
మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలకు పాలాభిషేకం

సూర్యలంక సముద్ర తీర అభివృద్ధికి రూ.97 కోట్లు మంజూరు కావడంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చిత్రపటాలకు సూర్యలంక సముద్రతీరం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. బాపట్లలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
News March 28, 2025
భారత్లోనూ భూకంప తీవ్రత

మయన్మార్లో సంభవించిన భూకంపం భారత్లోనూ ప్రభావం చూపుతోంది. మేఘాలయ, కోల్కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై ఇది 4 తీవ్రతతో నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మరోవైపు బ్యాంకాక్లో భారీ భూకంపం సంభవించడంతో థాయ్లాండ్ ప్రధాని షినవ్రత దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.