News March 21, 2025
TODAY HEADLINES

* SCలను ఆదుకుంది TDPనే: చంద్రబాబు
* తిరుమల దర్శనాలపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
* మోదీలాగే బాబూ వరుసగా సీఎం కావాలి: పవన్
* వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా: KTR
* త్వరలో 10,762 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: అనిత
* ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 30 మంది మావోల మృతి
* భారత క్రికెటర్ చాహల్-ధనశ్రీకి విడాకులు మంజూరు
* బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. రానా, విజయ్పై కేసు
* లండన్లో పురస్కారం అందుకున్న చిరంజీవి
Similar News
News November 11, 2025
బిహార్ తుది దశ పోలింగ్కు సిద్ధం

బిహార్లో తుది దశ పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఉ.7-సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1,302 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65.08శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అదే కంటిన్యూ అవుతుందా అని ఆసక్తి నెలకొంది. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.
News November 11, 2025
వైద్యుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు

TG: నార్కట్పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంతో మహిళ మరణించిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారులు ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నెలలోగా డబ్బు చెల్లించకపోతే 9% వడ్డీతో చెల్లించాలని పేర్కొంది. ఆరెగూడెంకు చెందిన స్వాతి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యం వికటించి మరణించింది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఫోరంను ఆశ్రయించారు.
News November 11, 2025
నవంబర్ 11: చరిత్రలో ఈరోజు

1888: స్వాతంత్ర్య సమర యోధుడు, భారత తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (ఫొటోలో)
1917: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్.రంగా జననం
1970: రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాడపాటి హనుమంతరావు మరణం
1974: హాస్య నటుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి మరణం
1994: భారత క్రికెటర్ సంజూ శాంసన్ జననం
2023: నటుడు చంద్రమోహన్ మరణం
* జాతీయ విద్యా దినోత్సవం


