News March 21, 2025
యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 1,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.52,500, ప్రసాద విక్రయాలు రూ.7,87,840, VIP దర్శనాలు రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.1,50,000, కార్ పార్కింగ్ రూ.2,24,000, వ్రతాలు రూ.69,600, యాదరుషి నిలయం రూ.42,000, లీజెస్ రూ.6,71,986 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.23,46,131 ఆదాయం వచ్చింది.
Similar News
News July 4, 2025
లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కలెక్టర్

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.
News July 4, 2025
నాటుసారా నిర్మూలనతో సమాజానికి నవోదయం: కలెక్టర్

ప్రజల్లో అవగాహన కలిగించి రాష్ట్రంలో నాటు సారాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవోదయం కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్ను అయన సందర్శించారు. జిల్లాలో మొదటి దశ నవోదయం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో నవోదయం 2.0ను ప్రారంభించామని చెప్పారు.
News July 4, 2025
నిధులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో CSR నిధులు ఉన్నప్పటికీ మైక్రో వాటర్ ఫిల్టర్ల నిర్మాణంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని RWS అధికారులను కలెక్టర్ బాలాజీ ప్రశ్నించారు. కలెక్టరేట్లో గ్రామీణ నీటి సరఫరా ఫిల్టర్లు, అంగన్వాడీ కేంద్రాల్లో వర్షపు నీటి నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. గ్రామాల్లో మైక్రో వాటర్ ఫిల్టర్లను నిర్మించడంలో RWS ఇంజినీర్లు శ్రద్ద చూపడం లేదని కలెక్టర్ అన్నారు.