News March 21, 2025
వనపర్తిలో వ్యక్తికి జైలు శిక్ష

ప్రజలు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపవద్దని వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి అన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వనపర్తికి చెందిన రమేశ్ నాయక్ అనే వ్యక్తిని గురువారం కోర్టులో హాజరు పరచగా.. అతడికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించామని తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
Similar News
News January 13, 2026
వేములవాడ: భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 12 నుంచి సోమవారం రాత్రి 10 గంటల వరకు మొత్తం 1,08,438 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. 10,294 మంది భక్తులు కోడె మొక్కులు చెల్లించినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
News January 13, 2026
DSC 2026: అనంతపురం జిల్లాలో పోస్టులు ఎన్నంటే?

రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 252 ఉపాధ్యాయ <<18842620>>పోస్టులను<<>> భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ ప్రాథమికంగా తేల్చింది. 792 ఖాళీలు ఉండగా, మిగిలిన పోస్టులను పదోన్నతులతో నింపనున్నారు. అధికారులు సిద్ధం చేసిన జాబితాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ, ఎస్జీటీ ఖాళీలు తక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రకటన వెలువడే అవకాశం ఉండగా, జూన్ కల్లా నియామక ప్రక్రియ ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
News January 13, 2026
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ Y పోస్టులు

<


