News March 21, 2025
మెదక్: వైద్య సేవల బలోపేతానికి ప్రణాళిక: మంత్రి

ప్రభుత్వ హాస్పిటళ్లలో అధునాతన సౌకర్యాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆసుపత్రులలో వైద్య సేవల బలోపేతానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్య ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగేలా బ్రాండింగ్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
Similar News
News March 31, 2025
మెదక్: గ్రూప్ -1లో 41వ ర్యాంక్ సాధించిన శైలేష్

టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ – 1 ఫలితాల్లో మెదక్ పట్టణానికి చెందిన పూనా శైలేష్ 41వ ర్యాంక్ సాధించాడు. నిన్న తుది ఫలితాలు ప్రకటించగా 503.500 మార్కులు వచ్చాయి. కాగా 1 నుంచి 7వ తరగతి వరకు మెదక్ శివ సాయి స్కూల్, 8 నుంచి 10 అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ తూప్రాన్, ఇంటర్ నారాయణ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీలో చదివాడు. కాగా, గ్రామస్థుల నుంచి శైలేష్కు ప్రశంసలు వెల్లువెత్తాయి.
News March 31, 2025
మాసాయిపేట: విద్యుత్ షాక్తో మృతి

మాసాయిపేట మండలంలో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మాసాయిపేటకు చెందిన గౌరవగల్లు నరసింహులు (42) స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి జారిపడ్డాడు. అదే సమయంలో వాటర్ హీటరు పెట్టిన బకెట్లో చేయ్యిపడి విద్యుత్ షాక్ తగిలింది. విద్యుదాఘాతం ఏర్పడి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందినట్లు భార్య సంతోషి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News March 30, 2025
MDK: వన దుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్

ఉగాది పర్వదినం పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సకుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరి పేర వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగి సూర్య శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ను శాలువాతో సన్మానించారు.