News March 21, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..

image

కుకునూరుపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం.. గజ్వేల్ మండలం దిలాల్పూర్‌కు చెందిన క్యాసారం బాబు సిద్దిపేట నుంచి గజ్వేల్ వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ మధ్యలో స్తంభానికి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News March 22, 2025

వనపర్తి: ప్రతి ఒక్క దివ్యాంగుడికి యూనిక్ డిజేబుల్ ఐడీ: కలెక్టర్

image

ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూనిక్ డిజేబుల్ ఐడీని అమల్లోకి తీసుకొచ్చిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనిక్ డిజేబుల్ ఐడీ అంశంపై ఎంపీడీవోలు, మీసేవ ఆపరేటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. యూడీఐడీ కార్డు కోసం దివ్యాంగులు ఆన్లైన్ (www.swavlambancard.gov.in) ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.

News March 22, 2025

గద్వాల: ‘ఎవరైనా వేధిస్తే మాకు చెప్పండి’ 

image

గద్వాల మండలం గోనుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ మొగలయ్య హాజరై ప్రసంగించారు. షీటీం సేవల గురించి, వేధింపులకు గురైనప్పుడు షీటీంను సంప్రదించాల్సిన ఆవశ్యకత, విద్య ప్రాముఖ్యత తెలియజేశారు. మహిళలు తమ కాళ్లపై తాము ఆర్థికంగా నిలబడాలన్నారు.

News March 22, 2025

ఆ జట్లు తలపడితే భారీ క్రేజ్: హర్భజన్ సింగ్

image

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచులకు ఏవిధంగా క్రేజ్ ఉంటుందో, ఐపీఎల్ ఈవెంట్ లో చెన్నై-ముంబయి మ్యాచులకు అలాంటి క్రేజ్ ఉంటుందని హర్భజన్ సింగ్ అన్నారు. రెండు జట్లలో టాప్ ప్లేయర్స్ ఉన్నారని, మంచి ఫ్యాన్ బేస్ ఉందని తెలిపారు. ధోనీ ఆటకోసం CSK ఫ్యాన్స్ ఏడాదిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటి యువ క్రికెటర్లలో రియాన్ పరాగ్ గేమ్ తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. రేపు చెన్నైలో MI-CSK తలపడనున్నాయి.

error: Content is protected !!