News March 21, 2025

ఈనెల 27న జిల్లా, మండల పరిషత్ సభ్యుల ఎన్నికలు

image

కర్నూలు జిల్లా, మండల పరిషత్‌లలో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు, MPP పదవుల భర్తీకి ఈనెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సులేమాన్ గతేడాది మార్చి 28న, క్రిష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ ఈఏడాది జనవరి 1న మృతిచెందారు. వెల్దుర్తి, తుగ్గలి MPPలు శారద, ఆదెమ్మ రాజీనామా చేశారు. ఈ 4 పోస్టులకు ఈనెల 23న నోటిఫికేషన్ ఇచ్చి, 27న మధ్యాహ్నం సభ్యులను ఎన్నుకుంటారు.

Similar News

News November 7, 2025

చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

image

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.

News November 7, 2025

కాగజ్‌నగర్: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

image

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) కుమురం భీం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సుంకరి సాయి క్రిష్ణ, వసాకే సాయికుమార్‌లు ఎన్నికయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ. 8,600 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజులు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

News November 7, 2025

కల్వకుర్తిలో కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

image

ఈ నెల 9న కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. 2006 తర్వాత జన్మించిన, 75 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.