News March 21, 2025
అల్లూరి: ‘సెల్ టవర్లకు త్వరితగతిన కనెక్షన్లు ఏర్పాటు చేయండి’

అల్లూరి జిల్లాలో సెల్ సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని, నిర్మాణాలు పూర్తయిన సెల్ టవర్లకు ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వివిధ నెట్వర్క్ సంస్థలతో సమావేశం నిర్వహించారు. సెల్ టవర్ల కోసం అనేక గ్రామాల నుంచి దరఖాస్తులు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా మంజూరైన సెల్ టవర్లను పనిచేసే స్థితికి తీసుకు రావాలని ఆదేశించారు.
Similar News
News November 14, 2025
రెయిన్బో డైట్ గురించి తెలుసా?

బరువు తగ్గడానికి కొందరు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇంకొందరు, కండలు తిరిగిన దేహం కోసం మరికొందరు రకరకాల డైట్ ప్లాన్లను అనుసరిస్తున్నారు. వాటిల్లో ఒకటే రెయిన్బో డైట్. పళ్లెంలో రంగురంగుల పళ్లు, కాయగూరలు, ఆకుకూరలకు చోటు కల్పించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. దీనిద్వారా శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయంటున్నారు.
News November 14, 2025
NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.
News November 14, 2025
రబీ మొక్కజొన్న కలుపు నివారణ ఎలా?

మొక్కజొన్న విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటిలో తేలిక నేలలకు అట్రాజిన్ 800గ్రా, బరువు నేలల్లో 1200 గ్రా. కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత 25-30 రోజులకు కలుపు ఉద్ధృతిని బట్టి 200 లీటర్ల నీటిలో టెంబోట్రయాన్ 34.4%S.C ద్రావణం 115ml కలిపి కలుపు 3,4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. తుంగ సమస్య ఎక్కువుంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో హేలోసల్ఫ్యురాన్ మిథైల్ 75 W.G 36 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


