News March 21, 2025
మాచవరంలో మహిళ దారుణ హత్య

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పని చేస్తున్న సీతారత్నం (61) ను అతి దారుణంగా కొట్టడంతో తలకు తీవ్రమైన గాయమై మృతి చెందింది. మాచవరం PHCలో పనిచేస్తున్న సూపర్వైజర్ శ్రీనివాసరావుకు సీతారత్నంకు కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. డబ్బులు విషయంలో వీరిద్దరి మధ్య గొడవ కావడంతో ఈ హత్య జరిగినట్లు పిడుగురాళ్ల సీఐ వెంకటరావు తెలిపారు.
Similar News
News September 19, 2025
మొక్కజొన్నలో పాము పొడ తెగులును ఎలా గుర్తించాలి?

పాము పొడ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కజొన్న మొక్కల కింది ఆకులపై సోకుతుంది. తర్వాత పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కల ఆకులు, కాండంపై బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి.. చూడటానికి పాముపొడ వలే కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల్ల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. దీని వల్ల మొక్కల సంఖ్య తగ్గి పంట దిగుబడి పడిపోతుంది.
News September 19, 2025
HYD- నల్లగొండ.. 74 కొట్టుకుపోయిన డెడ్బాడీ

అఫ్జల్సాగర్ నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీ యువకుడు అర్జున్ (26) మృతదేహం నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద మూసీలో కనిపించింది. ఈ నెల 14న అర్జున్, రామా గల్లంతయ్యారు. 5 రోజుల తర్వాత నల్లగొండ మూసీ నదిలో డెడ్బాడీ ఉన్నట్లు సిబ్బంది కనుగొన్నారు. అతడి డెడ్బాడీ 74 కిలో మీటర్ల దూరం కొట్టుకుపోయింది. అర్జున్కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
News September 19, 2025
మొక్కజొన్నలో పాము పొడ తెగులు నివారణ ఎలా?

మొక్కజొన్నలో పాముపొడ తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఆకులను తొలగించి నాశనం చేయాలి. తర్వాత 200 గ్రా. కార్బెండజిమ్ (లేదా) 200 మి.లీ. ప్రోపికొనజోల్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఏటా ఈ తెగులు ఆశించే ప్రాంతాల్లో పంట విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకకముందే ఈ మందులను పిచికారీ చేసుకోవాలని.. పంట చుట్టూ కలుపు మొక్కలను తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.