News March 21, 2025
MNCL: స్కాలర్షిప్.. APPLY NOW

2025 సంవత్సరంలో ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం డిగ్రీ పూర్తయినా లేదా చివరి ఏడాది చదువుతున్న వారు మే 19లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు https://telanganaepass.cgg.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
Similar News
News December 28, 2025
అనంత: భారీగా పెరిగిన చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గుత్తి పట్టణంలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260. అనంతపురంలో రూ.220, స్కిన్ లెస్ రూ.260. గుంతకల్లులో రూ.220, స్కిన్లెస్ రూ.240గా విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మటన్ రూ.750లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఒక్కసారి ఇలా చికెన్ ధరలు పెరగడంతో మాంసం ప్రియులు అయోమయంలో పడ్డారు.
News December 28, 2025
ఎయిర్పోర్ట్ భూముల కబ్జా.. ఏఏఐ అధికారులు సీరియస్

మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ చివరి దశకు వచ్చినా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు చెందిన 706 ఎకరాల్లో 9.86 ఎకరాలు కబ్జా అయింది. ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్ శివారు ఓ సర్వే నంబర్లో ఏఏఐకి చెందిన బెస్త చెరువు కాలనీ పరిసరాల్లోనే 9.86 ఎకరాల భూమిలో ఇళ్ల నిర్మాణాలు ఉండడంతో విస్తుపోయిన ఏఏఐ HYD విభాగం జనరల్ మేనేజర్ నటరాజు, డైరెక్టర్ వీవీ రావు రెవెన్యూ అధికారులను అడిగినట్లు తెలిసింది.
News December 28, 2025
కోటీశ్వరుడు.. ర్యాపిడో డ్రైవరయ్యాడు

కరోనా కష్టాలు ఒక కోటీశ్వరుడిని ర్యాపిడో డ్రైవర్గా మార్చేశాయి. ఒకప్పుడు ₹కోట్లలో వ్యాపారం చేసిన ఆయన కొవిడ్ వల్ల ఏకంగా ₹14 కోట్లు నష్టపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఉపాధి కోసం ర్యాపిడో నడుపుతున్నారు. Amity యూనివర్సిటీలో చదివిన అతడు ఒక ప్రయాణికుడితో తన బాధ పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న కథ నెట్టింట వైరలవుతోంది. ‘ఇప్పటికీ దేవుడిపై నమ్మకం ఉంది. ఓటమిని ఒప్పుకోను’ అంటున్న ఆయన ధైర్యం కదిలిస్తోంది.


