News March 21, 2025

MBNR: చెట్టుపై నుంచి కిందపడి వ్యక్తి మృతి

image

ఈనెల 15న చెట్టు ఎక్కి ఆకులు తెంచుతుండగా.. కాలు జారికిందపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్‌కు చెందిన సత్యం(30) గ్రామ సమీపంలోని చెట్టు ఎక్కి కిందపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Similar News

News November 11, 2025

జడ్చర్ల: 305 గ్రాముల గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

image

జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారు ఆర్.బి.ఆర్ కంపెనీలో వంట మాస్టర్‌గా పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రవిదాస్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై కార్తీక్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సిద్ధార్థ పాల్గొన్నారు.

News November 10, 2025

MBNR: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

News November 10, 2025

MBNR: నీటి వనరుల గణనపై జిల్లా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

image

రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు, 7వ చిన్న నీటి పారుదల గణన, రెండో నీటి వనరుల గణన 2023-24 కోసం జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.