News March 21, 2025

జడ్చర్లలో యూపీ వాసి మృతి

image

ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న యూపీకి చెందిన విశ్వకర్మ(20), నిఖిల్ జైస్వాల్(19)లు పని మీద స్కూటీపై మెడికల్ షాప్‌కు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా ఓ ఆటో ఢీకొట్టింది. గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిన్న నిఖిల్‌ను యూపీ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.

Similar News

News January 19, 2026

MBNR: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

భూత్పూర్ మండలం తాటికొండ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<18892567>>ప్రాణాలు<<>> కోల్పోయాడు. SI చంద్రశేఖర్ వివరాలు.. కోయిలకొండ మండలం కొతలబాద్‌కు చెందిన రవికుమార్(26) తన స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళ్తుండగా అన్నాసాగర్‌కు చెందిన ఆకాశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహం కాగా, బాబు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 18, 2026

జడ్చర్ల: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరం: లక్ష్మారెడ్డి

image

మాజీ మంత్రులు హరీశ్ రావు, KTRలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను మారీచుడు, సుబాహుడు అని సంబోధించడం, “నడుం విరగ్గొడతా” అని మాట్లాడటం నీచమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు వచ్చాయని, ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లతో ప్రాజెక్టులు నిర్మించామని గుర్తుచేశారు. తాము ఎన్నడూ అభివృద్ధికి అడ్డుపడలేదని స్పష్టం చేశారు.

News January 18, 2026

MBNR: రేపే ఆఖరి తేదీ దరఖాస్తు చేసుకోండి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. రేపటి (19)వరకు సీసీటీవీ కెమెరా శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పించనున్నారు. 19 నుంచి 45 సం. వయస్సు గల పురుషులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.