News March 21, 2025
పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా!

వాతావరణంలో మార్పుల వల్ల పెద్దపల్లి జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు వేసవి నేపథ్యంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇక 10 దాటితే ఎండ తీవ్రత పెరుగుతుంది. వ్యవసాయదారులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గడిచిన 24 గంటల్లో ముత్తారం మండల కేంద్రంలో 37.8℃ గరిష్ట ఉష్ణోగ్రతలు, జూలపల్లి 22.0℃అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Similar News
News November 3, 2025
గద్వాల సబ్ డివిజన్ ఆఫీసులో వినియోగదారుల దినోత్సవం

గద్వాల విద్యుత్ సబ్ డివిజన్ ఆఫీసులో నేడు విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏడీఈ రమేష్ బాబు ఆదివారం రాత్రి ప్రకటనలో తెలిపారు. గద్వాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గద్వాల టౌన్, రూరల్, ధరూర్, కేటి దొడ్డి మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలని కోరారు. ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవాలన్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందన్నారు.
News November 3, 2025
ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

జనసమూహం ఉన్న చోట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పార్వతీపురం మన్యం కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి సూచించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, ఫైర్ సర్వీసెస్, వైద్యారోగ్య శాఖ, నిర్వాహకులు నిరంతరం సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని సూచించారు. రద్దీని నివారించడానికి అవసరమైన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలన్నారు. అగ్నిమాపక, వైద్యసహాయ బృందాలు అందుబాటులో ఉండాలన్నారు.
News November 3, 2025
ఉమెన్స్ WC ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

టీమ్ ఇండియా ICC ఉమెన్స్ వన్డే <<18182320>>వరల్డ్ కప్<<>> విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో కప్పు కొట్టిన భారత్కు రూ.39.55 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. రన్నరప్ SA జట్టు రూ.19.77 కోట్లు అందుకుంటుంది. ఈ WCలో ప్రైజ్మనీ+బోనస్లు+పార్టిసిపేషన్ ఫీ+BCCI కార్యదర్సి దేవజిత్ సకారియా ప్రకటించిన రూ.51 కోట్లతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ.93.66 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంటుంది.


