News March 21, 2025
BIG BREAKING: మంత్రి ఫరూక్ సతీమణి మృతి

న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని వారి ఇంట్లోనే వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఇవాళ మృతి చెందారు.
Similar News
News March 31, 2025
మాజీ మంత్రి కాకాణికి పోలీసుల నోటీసులు

AP: క్వార్ట్జ్ అక్రమాలు, పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మంత్రితోపాటు ఆయన PA ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నోటీసుల ప్రకారం ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ DSP కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నట్లు వెల్లడించారు.
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా: SP

కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా SP అశోక్ కుమార్ పేర్కొన్నారు. కడప ఉమేష్ చంద్ర కల్యాణ మండపంలో ముస్లిం సోదరులకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కడపలో ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.
News March 31, 2025
SRH ఆరోపణలపై స్పందించిన HCA

SRH, HCA ప్రతిష్ఠను మసకబార్చేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని HCA మండిపడింది. SRH యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి ఈమెయిల్స్ రాలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. కాగా ఉచిత పాస్ల కోసం HCA తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని SRH ఆరోపించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టికెట్ల విషయంపై HCA అధ్యక్షుడు జగన్ బెదిరించినట్లు సమాచారం.