News March 21, 2025
మెదక్: అంతరిస్తున్న అడవులు..!

జీవకోటికి ప్రాణవాయువు అందించేది అడవులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా అడవి తగ్గడంతో పర్యావరణానికి ముంపు ముంచుకొస్తోంది. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రకారం 6.,89,342 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు భూములు ఉన్నాయి. ఇందులో 6,865 ఎకరాల భూమి అక్రమనకు గురికావడంతో జీవరాసులకు మనుగడ లేకుండా పోతుందని అటవీ సిబ్బంది అధికారులు చెబుతున్నారు.
Similar News
News November 1, 2025
మెదక్: బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలు వీరే..

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్లో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలు వీరే. ఓపెన్ కేటగిరీలో డా. కార్తీక్, నాగవర్ధన్ జోడీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగేంద్ర 2వ స్థానంలో నిలిచారు. 40ఏళ్లు పైబడిన విభాగంలో ప్రవీణ్, అశ్విన్లు విజేతలుగా నిలిచారు. మహిళా విభాగంలో వీణ, మౌనిక జోడీ ప్రథమ స్థానంలో నిలిచారు. త్వరలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
News October 31, 2025
మెదక్: ‘మహిళల, బాలికల భద్రతకే షీ టీమ్స్’

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. వేధింపులకు గురైనవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెలలో జిల్లాలో 17 ఎఫ్ఐఆర్లు, 13 ఈ-పిటి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే 69 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 88 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.
News October 31, 2025
తూప్రాన్: మళ్లీ కనిపించిన పులి

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి మళ్లీ శుక్రవారం కనిపించింది. మల్కాపూర్ – దాతర్ పల్లి మార్గమధ్యలో గుండుపై సేద తీరుతూ శుక్రవారం ఉదయం కనిపించింది. బుధవారం కనిపించిన ప్రదేశంలోనే మళ్లీ పులి కనిపించడంతో అక్కడే మకాం వేసినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


