News March 21, 2025

టెక్కలి: విద్యార్థుల సహనానికి “పరీక్ష”

image

టెక్కలిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం విద్యార్థులు మండుటెండలో అవస్థలు పడ్డారు. ఉదయం 8.45 గంటలకు కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో మండుటెండలో నిలబడ్డారు. అధికారుల తీరుపై కొంత మంది తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో విద్యార్థులను లోపలికి అనుమతించారు. 

Similar News

News March 24, 2025

శ్రీకాకుళం: జిల్లాలో నేడు ఈ మండలాల వారికి అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాల్లో సోమవారం ఎండ తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది. జిల్లాలోని బూర్జ, హిరమండలం, ఎల్.ఎన్ పేట, సరుబుజ్జిలి మండలాల్లో 37 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రతగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిన్నారులు, వృద్ధులు విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

News March 24, 2025

SKLM: ‘ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షకు 39946 మంది హాజరు’

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం జరిగిన ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షకు 39,946 మంది హాజరయ్యారు. ఈ విషయాన్ని డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ పెద్దింటి కిరణ్ కుమార్ తెలిపారు. తొలుత అన్ని మండలాల్లోని ఏరియా కోఆర్డినేటర్లు ఏపీఎంలు ఆయా అభ్యర్థులు పేర్లు నమోదు చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం పటిష్ఠంగా చేపడుతున్న వయోజనులకు అక్షరాస్యత కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.

News March 23, 2025

అరసవల్లి ఆదిత్యుని నేటి ఆదాయం

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.3,76,300/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,41,803/-లు, ప్రసాదాలకు రూ.1,73,720/-లు,శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. 

error: Content is protected !!