News March 21, 2025

NGKL: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. బిజినేపల్లి మం. సల్కర్‌పేటకు చెందిన శ్రీనివాసులు(55) బైక్‌పై సొంతూరుకి వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను HYDలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News March 31, 2025

‘బేబి’కి రూ.కోటి రెమ్యూనరేషన్?

image

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సరిపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉండగా ఆ అవకాశాన్ని ‘బేబీ’ హీరోయిన్ క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు ఆమె పారితోషికం పెంచారని టాక్. ఒక్కో సినిమాకు రూ.కోటి పైనే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సిద్ధూతో కలిసి ‘జాక్’లో నటిస్తోండగా ఆనంద్ దేవరకొండతో మరో సినిమాకు ఓకే చెప్పారు.

News March 31, 2025

అర్ధరాత్రి కారు వీరంగం.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

రాజమండ్రి రూరల్ కొంతమూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాజీపేటకి చెందిన ఈర్లు నాగబాబు (44) ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి బైక్ రైడ్‌లో ఉండగా మనీష్ ఫంక్షన్ హాల్ వద్ద మద్యం మత్తులో కారులో నలుగురు వేగంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టారు. దీంతో నాగబాబుతో పాటు వెనక కూర్చున్న కస్టమర్ వీరబాబు(28) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

News March 31, 2025

గ్రూప్‌-1 ఫలితాల్లో నల్గొండ జిల్లా వాసికి సెకండ్ ర్యాంక్

image

నల్గొండకు చెందిన దాది వెంకటరమణ గ్రూప్‌-1లో 535 మార్కులతో జనరల్‌ ర్యాంకుల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్‌ సాధించారు. వెంకటరమణ ఐదేండ్లుగా సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. తల్లిదండ్రులు దాది శ్రీనివాసరావు ఐడీసీలో ఏఈగా, తల్లి రమాదేవి అనుముల మండలం అలీనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వెల్లడించిన జేఎల్‌, డీఏఓ, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలకు సైతం వెంకటరమణ ఎంపికయ్యారు.

error: Content is protected !!