News March 21, 2025

యాదాద్రి: ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

image

జిల్లాలో 10వ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకుని పరీక్ష హాల్లోకి వెళ్లారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుంది.

Similar News

News March 31, 2025

మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

image

మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు వివరాలు.. ఆసుపాకకు చెందిన దివ్యాంగురాలు తన తల్లితో పాటు కలిసి ఉంటుంది. శనివారం తల్లి బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రావడంతో వెంకటేశ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 31, 2025

తూప్రాన్: గ్రూపు-1లో 17వ ర్యాంకు

image

తూప్రాన్ పట్టణానికి చెందిన బోయినిపల్లి ప్రణయ సాయి ఆదివారం ప్రకటించిన ర్యాంకుల్లో గ్రూపు -1లో 513 మార్కులతో రాష్ట్రస్థాయి 17వ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విష్ణువర్ధన్, శ్రీవిద్య దంపతుల కుమారుడైన ప్రణయ్ సాయి గ్రూపు-lV ఫలితాల్లో 42 ర్యాంకు సాధించి చేగుంట రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్ -llలో 134, గ్రూపు -lllలో 148 ర్యాంకు సాధించాడు.

News March 31, 2025

కొయ్యలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందిన కొయ్యలగూడెం(M) సీతంపేట వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం(M) లక్కవరం గ్రామానికి చెందిన వీర నాగేశ్వరరావు, భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి రాజమండ్రి వెళ్తున్నారు. సీతంపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో నాగేశ్వరరావు మృతి చెందగా భార్యాపిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.

error: Content is protected !!