News March 21, 2025
విద్యుత్ ఛార్జీల పెంపుపై UPDATE

TG: విద్యుత్ ఛార్జీల పెంపుపై TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఛార్జీల పెంపునకు ప్రతిపాదించట్లేదని తెలిపారు. విద్యుత్ నియంత్రణ భవన్లో ఈఆర్సీ ఛైర్మన్ అధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. టీజీఎస్పీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై జరిగిన విచారణకు సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. కాగా నిన్న ఎన్పీడీసీఎల్ కూడా ఛార్జీలు పెంపునకు ప్రతిపాదించట్లేదని తెలిపింది.
Similar News
News January 16, 2026
APలో స్మాల్ మిక్స్డ్ మాడ్యులర్ ఎనర్జీ రియాక్టర్

AP: థర్మల్ ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేలా చిన్నస్థాయిలో థర్మల్, హైడ్రో మిక్స్డ్ ఎనర్జీ రియాక్టర్ను నెలకొల్పేందుకు ఏపీ జెన్కో ఆలోచిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కోల్ ఇండియాతో కలిసి జాయింట్ వెంచర్ కింద దీనికి సంబంధించిన ప్లాంటు ఏర్పాటు ఆలోచన ఉందని జెన్కో ఎండీ నాగలక్షి ‘ది హిందూ’తో పేర్కొన్నారు. అయితే ఇది బొగ్గు రవాణా, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు.
News January 16, 2026
IOCLలో 405 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News January 16, 2026
‘అనగనగా ఒక రాజు’.. రూ.41.2 కోట్ల కలెక్షన్స్

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వరల్డ్ వైడ్గా 2 రోజుల్లో రూ.41.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మొదటి రోజు ఈ చిత్రం రూ.22కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.


