News March 24, 2024

అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్

image

అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను ప్రకటిస్తూ బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కాసేపటి క్రితం దేశవ్యాప్తంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఈయన రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.

Similar News

News March 16, 2026

కడప: పదో తరగతి ఎగ్జాం రూములోకి పాము

image

కడప జిల్లా బి.కోడూరులో పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న ఓ పరీక్షా కేంద్రంలోని రూములోకి పాము వచ్చింది. విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్కూల్ సిబ్బంది పామును చంపి బయట వేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లారు.

News March 16, 2026

సిద్ధవటం: ప్రారంభమైన పది పరీక్షలు

image

మండల కేంద్రమైన సిద్ధవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి పరీక్షల సందర్భంగా సిద్ధవటం మండల ఎస్సై హారిక ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏఎస్ఐ సుబ్బరామచంద్ర, కొండయ్య, కానిస్టేబుల్ రాఘవ బందోబస్తులో పాల్గొన్నారు.

News March 16, 2026

నేటి ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’: కడప కలెక్టర్

image

సోమవారం నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు పద్ధతులపై అవగాహన, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికతపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.