News March 21, 2025
పరీక్షా కేంద్రాలను సందర్శించిన DEO

జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలను సందర్శించారు. అనంతరం విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరీక్ష కేంద్రాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News September 16, 2025
భూగర్భ జలాల వృథా నియంత్రణకు పటిష్ట చర్యలు: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా భూగర్భ జలాల కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సోమవారం కలెక్టర్ కోయ శ్రీ హర్ష భూగర్భ జలాల వృథా నియంత్రణపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూగర్భ జలాలు అధికంగా వినియోగించే గ్రామాలలో జాగ్రత్తలు తీసుకోవడం కోసం విస్తృత ప్రచారం జరగాలని సూచించారు. పరిశ్రమలు తప్పకుండా భూగర్భ జల శాఖ అనుమతులు పొందేలా చూడాలని పేర్కొన్నారు. భూగర్భ జల అంచనాలు, జీఓ15 వివరాలు సమీక్షించినట్లు చెప్పారు.
News September 16, 2025
డ్రగ్స్ నియంత్రణకు విస్తృత చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం అవసరమని PDPL అదనపు కలెక్టర్ వేణు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై సోమవారం జరిగిన జిల్లా నార్కోటిక్ సమావేశంలో శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు, గంజాయి సాగు గుర్తించి నివారణ, GDKలో డీ-అడిక్షన్ కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News September 16, 2025
మంచిర్యాల జిల్లా వర్షపాతం వివరాలు

గడిచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లాలో 23.7మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా లక్షెట్టిపేట మండలంలో 84మి.మీ నమోదు కాగా.. జన్నారంలో 6.8, దండేపల్లి 44.2, హాజీపూర్ 78.2, కాసిపేట 19.8, తాండూర్ 17.4, భీమిని12.4, కన్నేపల్లి 2.6, వేమనపల్లి 14.6, నెన్నల 4.8, బెల్లంపల్లి 20.4, మందమర్రి 16.2, మంచిర్యాల 14.2, నస్పూర్ 11.2, జైపూర్ 10.8, భీమారం 2.4, చెన్నూర్ 24.8, కోటపల్లిలో 28.6మి.మీ నమోదైంది.