News March 21, 2025

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అన్నమయ్య కలెక్టర్

image

రాయచోటిలోని నేతాజీ సర్కిల్ దగ్గర గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ చామకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, డీఈఓ, ఆ శాఖ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News March 31, 2025

ORANGE ALERT: రేపటి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు

image

TGలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, MBNR, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడుతాయంది. ఏప్రిల్ 2, 3న ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది.

News March 31, 2025

లావేరు: జిరాక్స్ షాప్ యజమానికి రూ.36 లక్షల పన్ను నోటీసు

image

లావేరు(M) భరణికానికి చెందిన జిరాక్స్ షాపు యజమాని ఏ.హరికృష్ణకు ఒంగోలుకు సంబంధించిన GST డిప్యూటీ సహ కమిషనర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రూ.36,13,000 పన్ను బకాయి ఉన్నట్లుగా నోటీసులో ఉండటంతో అతను కంగుతిన్నాడు. తాను ఒంగోల్లో ఏ వ్యాపారం చేయలేదని, గతంలో బార్‌లో పని చేశానని పేర్కొన్నారు. అయితే ఒంగోల్లో హరికృష్ణ పేరు మీద హనుమాన్ ట్రేడర్స్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.

News March 31, 2025

గుడివాడ: కొడాలి నానితో పాటు ముంబై వెళ్లింది వీరే.!

image

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో సోమవారం హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, ఎన్‌ఎస్ రెడ్డి, శివకుమార్ అరెకపూడు, ప్రియాంక ఫెర్నాండేజ్, ఆకాంక్ష చోప్రా, కోనేరు రాజ్యలక్ష్మిలు కూడా ముంబై వెళ్లారు. 

error: Content is protected !!