News March 21, 2025
పాకిస్థాన్.. నీ ఆట ఊహాతీతం!

అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అస్థిరమైన ఆటతీరు కనబర్చే జట్టుగా పాకిస్థాన్కు పేరుంది. NZతో టీ20 సిరీస్లో ఆ పేరును మరోసారి సార్థకం చేసుకుంది. సిరీస్లో తొలి మ్యాచ్లో కేవలం 91 పరుగులకే చాప చుట్టేసిన పాక్, రెండో టీ20లో 135 పరుగులు చేసి ఓడింది. అదే జట్టు ఈరోజు జరిగిన 3వ టీ20లో 204 పరుగుల్ని 16 ఓవర్లలో ఛేదించేసింది. అంతర్జాతీయ టీ20ల చరిత్రలోనే 200 రన్స్ను ఇంత వేగంగా ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది.
Similar News
News April 1, 2025
TODAY HEADLINES

✒ మయన్మార్: 2వేలకు చేరిన భూకంప మృతుల సంఖ్య
✒ YCP మంత్రిని బీటెక్ రవి, బీద రవి తన్నారు: లోకేశ్
✒ రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్: నాదెండ్ల
✒ అన్యాయాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?: YS జగన్
✒ గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు
✒ కాకినాడ పోర్టు నుంచి TG బియ్యం ఎగుమతులు
✒ ‘రాజీవ్ యువ వికాసం’ గడువు APR 14 వరకు పొడిగింపు
✒ SRHకు HCA వేధింపులు.. సీఎం రేవంత్ ఆగ్రహం
✒ HCU భూములపై ముదురుతున్న వివాదం
News April 1, 2025
రామ్ చరణ్ ‘పెద్ది’ ఆడియో హక్కుల ధర ఎంతంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ- ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో మూవీకి మంచి బజ్ నెలకొనగా మూవీ టీమ్ తాజాగా మరో క్రేజీ న్యూస్ చెప్పింది. ఏఆర్ రెహమాన్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ను టీ-సిరీస్ రూ.35కోట్లకు దక్కించుకుందని ప్రకటించింది. రెహమాన్-చెర్రీ కాంబోలో ఇదే తొలిమూవీ కావడం విశేషం.
News April 1, 2025
ఆరుబయట పడుకుంటున్నారా?

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.