News March 21, 2025
జనగామ: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: రవీందర్

రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి రవీందర్ తెలిపారు. రాష్ట్రంలో వెనకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు వరం అని, స్వయం ఉపాధి కల్పించి తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రాజీవ్ యువ వికాసం పధకం ప్రకటించిందన్నారు. https://tgobmmsnew.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News November 20, 2025
మంచిర్యాల: ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి అనిత, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438ఎకరాలలో సాగు జరుగుతుందని, మిగతా లక్ష్యాన్ని సాధించాలన్నారు.
News November 20, 2025
మంచిర్యాల: ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి అనిత, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438ఎకరాలలో సాగు జరుగుతుందని, మిగతా లక్ష్యాన్ని సాధించాలన్నారు.
News November 20, 2025
సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.


