News March 21, 2025

పీయూ: ఆ సర్క్యూలర్‌ను వాపస్ తీసుకోవాలని SFI నిరసన 

image

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధిస్తూ వీసీ విడుదల చేసిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని, HCUలో 400 ఎకరాల భూములను వేలం వేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని SFI PU అధ్యక్షుడు బత్తిని రాము పాలమూరు యూనివర్సిటీ PG కాలేజ్ ముందు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు రాజేశ్, శ్రీనివాస్, విద్యుల్లత, ఈదన్న, సాయి, శిరీష, రాంచరణ్ పాల్గొన్నారు.

Similar News

News April 1, 2025

MBNR: తప్పుడు కేసులకు భయపడొద్దు: మాజీ మంత్రి

image

తప్పుడు కేసులకు భయపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాసానిపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత రవి నేరంలో ప్రమేయం లేకున్నా తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. జైలుకి వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన ఆయనను ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.

News March 31, 2025

మహబూబ్‌నగర్: రంజాన్ పండుగ భద్రతను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ఈద్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. శాంతిభద్రతలు, ప్రజల సౌకర్యం, శాంతియుతం,ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణ, అత్యవసర సేవల ఏర్పాట్లు ఈద్గా, మసీదులు ప్రధాన కూడళ్ల వద్ద అదనపు బందోబస్తు అంశాలపై అధికారులతో సమీక్షించారు.

News March 31, 2025

మహబూబ్‌నగర్: భారీ ధర్నాకు బీసీ సంఘం: గోనెల శ్రీనివాసులు

image

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.

error: Content is protected !!