News March 24, 2024

గోదారి జిల్లాల్లో 10 స్థానాల్లో జనసేన.. FINAL

image

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన 21 చోట్ల పోటీ చేయనుండగా అందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 10 అభ్యర్థులను ప్రకటిస్తూ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పి.గన్నవరం టికెట్ మొదట టీడీపీ అభ్యర్థికి కేటాయించినప్పటికీ చివరికి ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లింది. పోలవరం సీటు సైతం చివరివరకు సందిగ్ధత ఉండగా..చివరికి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు అవకాశం వచ్చింది. మొత్తంగా గోదారి జిల్లాలు జనసేనకు కీలకం కానుండగా ఓటరు ఎటువైపో..?

Similar News

News January 4, 2026

ప.గో: అక్క అనే పిలుపునకు అండగా నిలిచి.. తలకొరివి పెట్టి మానవత్వం చాటి..

image

రక్త సంబంధం లేకపోయినా చిన్న పిలుపుతో ఏర్పడిన అనుబంధం మానవత్వాన్ని చాటింది. బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను(45) శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, బంధువులు ఎవరూ రాలేదు. దీంతో శ్రీను ‘అక్క’ అని పిలిచే పొరుగున ఉన్న పతివాడ మావూళ్లమ్మ చలించిపోయింది. తానే స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆమె చూపిన ఈ చొరవను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటూ, మావూళ్లమ్మ పెద్దమనసును అభినందించారు.

News January 4, 2026

బీజేపీ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలిగా సత్యవతి

image

బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నరసాపురానికి చెందిన గన్నాబత్తుల సత్యవతిని నియమించారు. పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ ఈ బాధ్యతను అప్పగించింది. సత్యవతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అగ్ర నాయకత్వానికి, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలోని ప్రతి మహిళకు చేరేలా చూస్తానన్నారు.

News January 4, 2026

బీజేపీ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలిగా సత్యవతి

image

బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నరసాపురానికి చెందిన గన్నాబత్తుల సత్యవతిని నియమించారు. పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ ఈ బాధ్యతను అప్పగించింది. సత్యవతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అగ్ర నాయకత్వానికి, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలోని ప్రతి మహిళకు చేరేలా చూస్తానన్నారు.