News March 21, 2025
MBNR: భూముల అమ్మకాల నిర్ణయాన్ని విరమించుకోవాలి: ABVP

HCU యూనివర్సిటీల భూముల వేలాన్ని వెంటనే ఆపాలని పాలమూరు యూనివర్సిటీ ముందు ఈరోజు ఏబీవీపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కో కన్వీనర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా పాలన అని చెప్పి అధికారంలోకొచ్చి విద్యావ్యవస్థను తుంగలో తొక్కిందన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల భూములను వేల వేయడం ప్రభుత్వానికి చేతగానితనం వారు విమర్శించారు.విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే నిరసన చేస్తామన్నారు.
Similar News
News November 11, 2025
జడ్చర్ల: 305 గ్రాముల గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారు ఆర్.బి.ఆర్ కంపెనీలో వంట మాస్టర్గా పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రవిదాస్ను అరెస్ట్ చేసి అతని వద్ద 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై కార్తీక్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సిద్ధార్థ పాల్గొన్నారు.
News November 10, 2025
MBNR: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 10, 2025
MBNR: నీటి వనరుల గణనపై జిల్లా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు, 7వ చిన్న నీటి పారుదల గణన, రెండో నీటి వనరుల గణన 2023-24 కోసం జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.


